మీ న్యూస్ ప్రతినిధి:::మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి రేణుక జాతీయ జెండాని ఎగరవేసి గ్రామ ప్రజలకు 76 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు నాడు స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో త్యాగతనుల జీవిత కాదను నేటి భావితరాల పౌరులకు ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని తెలియజేయాలని అన్నారు. నేడు మనం ఇంత స్వేచ్ఛగా గాలిపించుకుంటున్నామంటే నాడు ఎందరో మహానీయులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్రం సాధించారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.