schedule Monday, August 31, 2026

పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి 

calendar_today November 12, 2024
person meenewstelugu
పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి 

పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి 

 టి పి టి యు రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ

 

మీ న్యూస్ ప్రతినిధి:: ఉపాధ్యాయ ఉద్యోగులకు పి ఆర్ సి వెంటనే అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘం జిల్లా సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు జీవో నెంబర్ 317 సబ్ కమిటీ నివేదికను అమలు పరచాలని ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మోడల్ స్కూల్ టీచర్లకు 0 1 0 వేతనాలు చెల్లించాలని అన్నారు అనంతరం సూర్యపేట జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారి కల్లూరు నాగయ్య పరిశీలకులుగా ఏ రమేష్ వ్యవహరించారు గౌరవాధ్యక్షులుగా చిలుక శ్రీనివాస్ నిమ్మల శ్రీనివాస్ సహా అధ్యక్షులుగా ముంత శ్రీనివాస్ సిహెచ్ పద్మ ఎస్ అరుణ బచ్చుపల్లి శంకర్రావు ఉపాధ్యక్షుడిగా కే సైదులు ధర్మయ్య స్వరూప ప్రధాన కార్యదర్శిగా కడపర్తి శ్రీనివాస్ నాయుడు ఆర్థిక కార్యదర్శిగా గోనగంటి కృష్ణ కార్యదర్శులుగా స్నేహలత ఏం సైదులు నవీన మీడియా ఇన్ఛార్జిగా సత్యనారాయణ ఎన్నుకున్నారు ఈ సమావేశంలో వివిధ మండల బాధ్యులు ఉదయ్ కేశయ్య వీరన్న రమేష్ వీరబాబు జోష్ సర్దార్ సింగ్ సింగ్ బుర్రి శ్రీను శ్రీనివాస్ రెడ్డి అంజయ్య తదితరులు పాల్గొన్నారు